తెలంగాణాలో ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఇంటర్ ఫలితాలను తెలంగాణా ఉన్నత విద్యా శాఖ రేపు విడుదల చేయనుంది. కరోనా ఉన్నా సరే వేగంగా ఇంటర్ ప్రశ్నా పత్రాల మూల్యాంఖనం పూర్తి చేసారు అధికారులు. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే ఈ కార్యక్రమం పూర్తి చేసారు. ఇక నేడు విడుదల చెయ్యాలి అని భావించినా సరే అది సాధ్యం కాలేదు. 

 

దీనితో రేపు మధ్యాహ్నం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి విడుదల చేయనున్నారు. ఆమె ఇప్పటికే దీనికి సంబంధించిన నివేదికను సిఎం కేసీఆర్ కి అందించారు. గత ఏడాది జరిగిన ఏ పొరపాటు కూడా ఈ ఏడాది జరగకుండా చూసుకుంటామని ఆమె పేర్కొన్నారు. ఏపీలో ఇప్పటికే ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: