బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ ఆత్మహత్య సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సుశాంత్ సింగ్ ని బాలీవుడ్ లో ప్రముఖులు హత్య చేసారు అంటూ పలువురు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా 8 మంది బాలీవుడ్ ప్రముఖులపై బీహార్ లో కేసు నమోదు అయింది. సల్మాన్ఖాన్, కరణ్జోహార్, సంజయ్లీలా భన్సాలీ, ఏక్తాకపూర్, దినేష్, సాజిద్ నడియద్ వాలా, భూషణ్ కుమార్, ఆదిత్య చోప్రాలపై క్రిమినల్ కేసు నమోదు చేసారు.
సుశాంత్ సొంత రాష్ట్రమైన బీహర్లోని ముజుఫర్ నగర్లోని కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. బాలీవుడ్ మాఫియా కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు అని సుదీర్ కుమార్ అనే ఒక న్యాయవాది పిటీషన్ దాఖలు చేయడమే కాకుండా ఇందులో కంగనా రనౌత్ ని సాక్షిగా చేర్చారు.