త్రిపుర అండర్ -19 మహిళా క్రికెట్ జట్టు క్రీడాకారిణి అయంతి రీయాంగ్ ఆమె నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 16 ఏళ్ళ యంతి జూన్ 16 అంటే మంగళవారం రాత్రి ఆమె తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు అని దినపత్రిక సియాండన్ కథనం ప్రచురించింది. 

 

ఆమె రాజధాని అగర్తాలా నుండి 90 కిలోమీటర్ల దూరంలో ఉదయపూర్ సబ్ డివిజన్ పరిధిలోని తైనాని గ్రామానికి చెందిన రీయాంగ్ తెగకు చెందిన అమ్మాయి. ఆమె మరణాన్ని త్రిపుర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి తిమిర్ చందా ఖండించారు. మంచి ప్రతిభను రాష్ట్ర కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేసారు. అండర్ -16  నుంచి ఆమె క్రికెట్ ఆడుతుందని అన్నారు. ఆమె మరణంపై ఆయన దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: