డీజీపీ గౌతం సవాంగ్కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాసారు. తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని లేఖలో ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. వెనుకబడినవర్గాలకు చెందిన నేతలపై కక్ష సాధిస్తున్నారని లేఖలో చంద్రబాబు ఆరోపించారు. అచ్చెన్నాయుడును అక్రమంగా అరెస్ట్ చేశారన్న ఆయన అలాగే అయ్యన్నపాత్రుడుపై అక్రమంగా కేసు నమోదు చేశారని పేర్కొన్నారు.
అయ్యన్నపాత్రుడుపై నిర్భయ యాక్ట్ నమోదు చేయడాన్ని తప్పుబట్టారు. పోలీసులు.. అధికార పార్టీ నేతలు చెప్పినట్టు పనిచేస్తున్నారని లేఖలో మండిపడ్డారు. ప్రభుత్వ చర్యలను ప్రశ్నిస్తే గొంతు నొక్కుతున్నారన్నారు. అలాగే సోషల్ మీడియా, సొంత మీడియా ద్వారా విపక్ష నేతల ప్రతిష్ఠకు భంగం కల్గిస్తున్నారని మండిపడ్డారు. డా.సుధాకర్, డా. అనితారాణిపై పెట్టిన కేసులను కూడా చంద్రబాబు లేఖలో ప్రస్తావించి తప్పుడు కేసులు అన్నారు.