ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశాల తీరు, అదే విధంగా అసెంబ్లీ లో ఏ మాత్రం చర్చ లేకుండా గవర్నర్ ప్రసంగాన్ని ఆమోదించిన తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గవర్నర్ ని కలవనున్నారు. గురువారం సాయంత్రం 6 గంటలకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్తో భేటీ కానున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక అక్రమ అరెస్ట్ లపై కూడా ఆయన ఫిర్యాదు చేసే అవకాశం ఉంది అని తెలుస్తుంది.
ప్రస్తుతం రాష్ట్రంలో పరిణామాలను గవర్నర్కు వివరించడమే కాకుండా వైసీపీ పాలనలో టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను కూడా ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళే అవకాశం ఉంది. ఇక టీడీపీ నేతల మీద కక్ష సాధింపుగా వ్యవహరిస్తున్నారు అని ఆరోపిస్తున్న చంద్రబాబు... అదే విషయం గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళే సూచనలు ఉన్నాయి.