ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి వయో పరిమితి పెంపు జీవోను 2021 సెప్టెంబర్ 30కు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నుంచి ఈ మేరకు జీవో 52 ఈరోజు జారీ అయింది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగ వయో పరిమితి 34 కాగా 2014, 2016 సంవత్సరాలలో పలు జీవోల ద్వారా ఈ వయస్సును 42 ఏళ్లకు పెంచారు. 
 
2017 నుంచి ప్రతి సంవత్సరం జీవోను పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం వస్తోంది. జగన్ సర్కార్ ఈ జీవోతో పాటు యూనిఫారం సర్వీసులైన వివిధ కేటగిరీ పోస్టుల వయో పర్మితి రెండేళ్ల పెంపు జీవోను 2021 సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ జీవో 53 ద్వారా ఉత్తర్వులను జారీ చేసింది. ప్రభుత్వం వయోపరిమితి జీవో పెంపు నిర్ణయం తీసుకోవడం ద్వారా ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో పాటు ఇతర ప్రభుత్వ ఏజెన్సీల నియామకాలకు పరీక్షలు రాసే ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: