ప్రపంచంలోనే కాదు.. మన దేశంలోనూ కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు ఎంతలా పెరుగుతుందో చూస్తూనే ఉన్నాం. గత వారం రోజుల నుంచి చూస్తూ సగటున రోజుకు 10-12 వేల కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనాకు మాత్రం కట్టడి వేయలేకపోతున్నాం. తాజాగా కరోనా గురించి ఇండియన్లకు ఓ గుడ్ న్యూస్ వినపడింది. కొత్త కరోనా కేసులు ఎన్ని ఎదురవుతున్నాయో ? కరోనా నుంచి కోలుకుంటోన్న వారి సంఖ్య సైతం అలాగే ఉంది.
దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 3, 66, 946 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 1, 94, 324 ( 52.95 % ) కేసులు రికవరీ అయ్యాయి. ప్రస్తుతం 1, 60, 384 ( 43.71 % ) కేసులు మాత్రమే యాక్టివ్గా ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే దేశంలో ప్రతి 100 కేసుల్లో 53 మంది ఎలాంటి ఇబ్బంది లేకుండా కోలుకుంటున్నారు. ఇది ఓ విధంగా మనకు శుభ పరిణామమే అని చెప్పాలి.