చైనా దాడిలో మరణించిన  సూర్యాపేట కు చెందిన కల్నల్ సంతోష్ బాబు భౌతిక కాయానికి అంతిమ  యాత్ర నిర్వహిస్తున్నారు. వీర జవాన్ కి రాజకీయ నేతలు ప్రముఖులు అందరూ కూడా నివాళులు అర్పిస్తున్నారు. ఇక అంత్యక్రియలు జరిగే చోట చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. గురువారం సూర్యాపేటలోని కాసరాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. 

 

కరోనా నేపధ్యంలో అంత్యక్రియలకు కేవలం 50 మందికి మాత్రమే అధికారులు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. సంతోష్‌బాబు కుటుంబసభ్యులు, ఆర్మీ అధికారులు మాత్రమే హాజరవుతారని స్పష్టం చేసారు.   సైనిక లాంఛనాలతో అంతిమసంస్కారాలు నిర్వహిస్తారు అధికారులు. ఆర్మీ అధికారి సుబేదార్ దినేష్ కుమార్ సూర్యపేటకు చేరుకుని అంత్యక్రియల ఏర్పాట్లను దగ్గర ఉండి చూసారు. ఇప్పుడు అంతిమ యాత్ర కొనసాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: