ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికల సందడి నెలకొంది. రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యసభ ఎన్నికలను నిర్వహించడానికి గానూ ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్రంలో 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో పార్టీలు కూడా జాగ్రత్తగా చర్యలను చేపట్టాయి. 

 

రాజ్యసభ ఎన్నికల బరిలో వైసీపీ నుంచి నలుగురు, టీడీపీ నుంచి ఒకరు నిలుస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఓటు ఎలా వేయాలి అనేది శాసనసభ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు చూపించనున్నారు. వైసీపీ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి, అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని బరిలో ఉన్నారు. టీడీపీ నుంచి వర్ల రామయ్య పోటీ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: