బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి ఇప్పుడు బాలీవుడ్ లో ఉన్న కొందరు ప్రముఖులే కారణం అనే ఆరోపణలు వస్తున్నాయి. ఇక సల్మాన్ ఖాన్ కరణ్ జోహార్ సహా పలువురిపై కేసులు కూడా నమోదు చేయించారు కొందరు. ఇక ఇదిలా ఉంటే... 

 

సుశాంత్ స్నేహితురాలు అతనితో సన్నిహితంగా ఉండే రియా చక్రవర్తి ని పోలీసులు విచారిస్తున్నారు. ఆమెను బాంద్రా పోలీస్ స్టేషన్ కి పిలిచారు అధికారులు. ఆమె  సుశాంత్ తో చివరి సారి మాట్లాడింది అని సమాచారం. అందుకే పోలీసులు ఆమెను పిలిచి విచారిస్తున్నారని తెలుస్తుంది. ఇక  ఈ కేసుకి సంబంధించి సుశాంత్ కుటుంబ సభ్యులను కూడా విచారించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: