నిన్న కృష్ణా జిల్లాలో జరిగిన భారీ రోడ్డు ప్రమాదంలో 12 మంది మరణించిన సంగతి తెలిసిందే. దైవ దర్శనానికి వెళ్ళే క్రమంలో లారీని ట్రాక్టర్ డీ కొట్టిన ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. ఇక  ఈ ఘటనలో మరణించిన 12 మంది మృతదేహాలకు ఒక్కొక్కరికి రెండు లక్షల సాయం అందించింది తెలంగాణా సర్కార్. 

 

ఇప్పుడు ఏపీ సర్కార్ కూడా వారికి సహాయం చేస్తుంది. జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి అంటూ సిఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు. ఏపీలో ప్రమాదం కాబట్టి సహాయం చెయ్యాలి అని ఆయన ఆదేశాలు ఇచ్చారు అధికారులకు.

మరింత సమాచారం తెలుసుకోండి: