మహారాష్ట్రలో దారుణ సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. 8 రోజుల పాటు బాత్ రూమ్ లోనే కరోనా మృతదేహం ఉంది. దీనిని ఆలస్యంగా గుర్తించారు. మహారాష్ట్రలోని జల్గావ్ సివిల్ ఆస్పత్రి బాత్రూంలో కరోనా రోగి మృతదేహం లభించింది. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ కి రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆయనను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. బాత్రూంలో కరోనాతో మరణించిన వృద్ధుడి మృతదేహం లభించింది.
ఎనిమిది రోజుల పాటు మృతదేహాన్ని ఎవరూ గమనించలేదు. ఆస్పత్రి యాజమాన్యం మాత్రం కరోనా రోగి కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆస్పత్రి వాష్రూంలోనే మృత దేహం అభించింది. దీనితో కలెక్టర్ పై చర్యలు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం.