ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత బీసీలపై కక్ష గట్టారు అని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. బీసీలంటే టీడీపీ వెన్నెముక అని ఆయన స్పష్టం చేసారు. అందుకే బీసీలపై దాడి చేస్తున్నారన్నారు. పోలీసులు కోవిడ్ నిబంధనలు పాటించకుండా అచ్చెన్నాయుడుని అరెస్టు చేశారని ఈ సందర్భంగా ఆరోపణలు చేసారు. దీంతో ఆయనకు రీ సర్జరీ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. దీనికి జగనే బాధ్యత వహించాలన్నారు.

 

యనమలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని... అయ్యన్న పాత్రుడుపై నిర్భయ కేసు పెట్టారని మండిపడ్డారు. బీసీలు నాయకులుగా ఎదగడం ఓర్చుకోలేకపోతున్నారని ఈ సందర్భంగా ఆరోపణలు చేసారు. హ్యూమన్ రైట్స్‌ కమిషన్‌కి ఫిర్యాదు చేశామన్న ఆయన... అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిపై సూపరింటెండెంట్‌ని అడిగి తెలుసుకున్నామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: