తెలంగాణాలో ఇప్పుడు కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కేసులు మాత్రం ఆగడం లేదు. ప్రధానంగా హైదరాబాద్ నగరం లో ఇప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎ నేపధ్యంలోనే తెలంగాణాలో కరోనా విషయంలో కేంద్రం సహకారం కోరాలి అని తెలంగాణా సర్కార్ భావిస్తుంది. కేసులు ఇదే విధంగా పెరిగితే ఇబ్బంది పడతామని కేసీఆర్ భావిస్తున్నారు. 

 

రాష్ట్రంలో ఇప్పుడు పరిస్థితి భయంకరంగా మారక ముందే కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని ఆయన యోచిస్తున్నారు. ఒక హైదరాబాద్ లో అయినా సరే ఒక రెండు వారాలు ఎక్కడివి అక్కడ బంద్ చేస్తే కనీసం కరోనా కట్టడి అయ్యే అవకాశం ఉంటుంది అని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: