హైదరాబాద్ లో కరోనా తీవ్రత రోజు రోజుకి పెరుగుతుంది. వందల కేసులు నమోదు కావడంతో అక్కడి ప్రజలు భయపడుతున్నారు. అసలు ప్రజలు బయటకు రావాలి అంటేనే భయపడుతున్నారు. ఈ నేపధ్యంలోనే హైదరాబాద్ లో హోల్ సేల్ వ్యాపారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా తీవ్రత పెరుగుతున్న నేపధ్యంలో...

 

ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకే షాపులను తెరవాలి అని నిర్ణయం తీసుకున్నారు. కరోనా తీవ్రత నేపధ్యంలో సాయంత్రం నాలుగు గంటల తర్వాత షాప్ లను ఓపెన్ చేయవద్దు అని నిర్ణయం తీసుకున్నారు. బేగం బజార్, సిద్ది అంబర్ బజార్ లో ఆసోసియేషన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనితో స్వచ్చందంగా వాళ్ళు లాక్ డౌన్ ని విధించుకున్నట్లు అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: