ఏపిలో గత ఏడాది ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వైసీపీ సర్కార్ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తుందని అన్నారు ఎమ్మెల్యే రోజా.  ముఖ్యమంత్రి పదవీ స్వీకారం చేసినప్పటి నుంచి వైఎస్ జగన్ ఇచ్చిన హాపీ ప్రతి ఒక్కటీ నేరవేరుస్తున్నారని.. ప్రజలకు అందుకే ఆయనపై మరింత నమ్మకాన్ని పెంచుకుంటున్నారని అన్నారు రోజా.  కరోనా కష్టాలు ఉన్నా కూడా ఎక్కడా వేనుకడుగు వేయకుండా కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరినీ ఆదుకుంటున్నారని.. రైతు కష్టాలు పడకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారని ఆమె అన్నారు.

 

కాగా,  ఏపీ ప్రభుత్వం తాజా అసెంబ్లీ సమావేశాల్లో రూ.2.24 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ లో వివిధ రంగాలకు కేటాయింపులను ఆ పార్టీ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా కూడా సోషల్ మీడియాలో దీనిపై పోస్టు చేశారు.  వైఎస్సార్ చేయూత, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం, అమ్మ ఒడి అంటూ స్త్రీలకు ఉపయోగపడే పథకాలకు బడ్జెట్ లో అధిక కేటాయింపులు చేపట్టారంటూ సీఎంను కొనియాడారు.అక్క, చెల్లెమ్మలకు అండగా నిలుస్తున్నారంటూ సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: