తెలంగాణా లో భయంకరంగా కరోనా కేసులు క్ష‌ణ క్ష‌ణానికి పెరిగి పోతున్నాయి. తెలంగాణలో రోజు రోజుకీ కరోనా ఉధృతి ఆగ‌డం లేదు. గురువారం అమాంతం పెరిగిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. మొత్తం 352 కరోనా పాజిటివ్ కేసులు నమోదు  అయ్యాయి. ముగ్గురు కరోనా పాజిటివ్ తో మృతి చెంద‌గా... ఇప్పటివరకూ కరోనాతో మొత్తం 195 మంది మృతి చెందారు. మొత్తం 6,027 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ  కాగా ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలో 302 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. 

 

ఇక రంగారెడ్డిలో 17, మేడ్చల్‌లో 10, మంచిర్యాలలో 4, జనగామలో 3, వరంగల్ అర్చన్‌లో 3, భూపాలపల్లిలో 2, మహబూల్ నగర్‌లో 2, మెదక్‌లో 2, నిజామాబాద్‌లో 2, సంగారెడ్డి‌లో 2, వరంగల్ రూరల్‌, నల్గొండ, ఖమ్మంలో ఒక్కో పాజిటివ్ కేసు నమోదు అయ్యాయి. గురువారం 230 మంది డిశ్చార్జి కాగా... ఇప్పటివరకూ 3301 మంది డిశ్చార్జి అయ్యారు. ఇంకా 2,531 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ లెక్క‌లు చూస్తుంటే తెలంగాణ‌లో ఇప్ప‌ట్లో క‌రోనా కంట్రోల్ అయ్యే ప‌రిస్థితి లేక‌పోగా... మ‌రింత ఘోర‌మైన ప‌రిస్థితులు ఏర్ప‌డ‌డం ఖాయంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: