ప్రపంచాన్ని వణికిస్తోన్న COVID19 సంక్షోభం నేపథ్యంలో ఏదేశానికి ఆ దేశం తీవ్రంగా విలవిల్లాడి పోతున్నాయి. ఆర్థిక వ్యవస్థలు ఎక్కడికక్కడ విచ్ఛిన్నం అవుతున్నాయి. ఇక మన దేశంలో కూడా కరోనా ఎంతలా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత వారం పది రోజుల లెక్కలు చూస్తే సగటున రోజుకు 10- 12 వేల కొత్త కేసులు దేశంలో నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలోనే రికవరీ రేటు కూడా ఉన్నా కేసులు పెరుగుతుండడం.. మరణాలు కూడా ఎక్కువగానే ఉండడంతో ఆందోళన ఎక్కువ అవుతోంది.
ఇదిలా ఉంటే ఈ మహమ్మారి ప్రభావాన్ని నిర్మూలించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సాధ్యం కావడం లేదు. ఈ క్రమంలోనే అత్యంత హానీ కరమైన ఈవైరస్ను ఎదుర్కొనేందుకు.... ప్రజలకు మద్దతు ఇవ్వడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సామర్థ్యాలను పెంచడానికి ఫ్రాన్స్ మరియు భారతదేశం ఓ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ రెండు దేశాలు 200 మిలియన్ యూరోలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.
France and india sign agreement committing 200 million euros to increase state, central governments' capacities to support India's most vulnerable people in the wake of #COVID19 crisis
— press Trust of india (@PTI_News) June 18, 2020