తెలంగాణాలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. రోజు రోజుకి అక్కడ కేసులు ఆందోళనకర స్థాయిలో నమోదు అవుతున్నాయి. కేసుల కట్టడిలో సమర్ధవంతంగా వ్యవహరించినా సరే ఆగడం లేదు. ఇక ఇదిలా ఉంటే తాజాగా కరోనా కేసులు  ఇప్పుడు ఎమ్మెల్యేలకు కూడా సోకడం తో తెలంగాణాలో ఆందోళన మొదలయింది. 

 

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ భార్య కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇటీవల ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ అని తేలింది అయితే బుధవారం మరోసారి శాంపిల్స్ తీసి పరీక్షించగా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లో చికిత్స పొందుతుందని అధికారులు పేర్కొన్నారు. ఇటివలే ఎమ్మెల్యే బాజిరెడ్డి కి కూడా కరోన పాజిటివ్ గా నిర్దారణ అయిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: