దేశ వ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. 18 స్థానాలకు గానూ వాయిదా పడిన రాజ్యసభ ఎన్నికలు నేటి నుంచి జరుగుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలే అవకాశాలు కనపడుతున్నాయి. అక్కడ బిజెపి కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద దృష్టి పెట్టింది. ఈ తరుణంలో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది అక్కడ. 

 

ఒక ఎమ్మెల్యే ఎన్నికలు  జరుగుతున్న సమయంలో ఓటు వేయకుండా ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు. మాతార్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బిజెపి ఎమ్మెల్యే కేసరిసింగ్ జెసాంగ్‌భాయ్ సోలంకి అంబులెన్స్‌లో శాసనసభకు చేరుకున్నారు. ఆరోగ్య సమస్య కారణంగా అతను ఆసుపత్రిలో చేరాడు చివరి నిమిషంలో అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆసుపత్రి నుండి నేరుగా అసెంబ్లీకి చేరుకున్నాడు. రాష్ట్రంలోని 4 రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: