జమ్మూ కాశ్మీర్ లోని షోపియన్‌లో మునాండ్ వద్ద ఒక ఉగ్రవాదిని అధికారులు గుర్తించారు. ఉదయం గుర్తించి అతని కోసం గాలింపు చేపట్టగా సదరు ఉగ్రవాదిని బలగాలు కాల్చి చంపాయి. ఒక ఉగ్రవాదిని చంపిన తరువాత పాంపూర్‌లోని మీజ్ వద్ద, మరో ఇద్దరు ఉగ్రవాదులను గుర్తించారు. వారు స్థానిక జామియా మసీదులోకి ప్రవేశించారని అధికారులు పేర్కొన్నారు. దీనిపై మాట్లాడిన జమ్మూ కాశ్మీర్ పోలీస్ ఉన్నతాధికారి ఇది భారీ నిర్మాణమని అన్నారు. 

 

తాము స్వేచ్చగా ముందుకు వెళ్ళే అవకాశం లేదని అన్నారు. మసీదులో దాక్కున్న ఇద్దరు ఉగ్రవాదులను గుర్తించి ఆపరేషన్ మొదలు పెట్టారు. మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో ఉన్నారు అని ఆయన తెలిపారు. ఆపరేషన్ కొనసాగుతుందని పేర్కొన్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: