టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సిఎం వైఎస్ జగన్ కి లేఖ రాసారు. ఈ లేఖలో ఆయన జీవో నెంబర్ 3 గురించి ప్రస్తావించారు. జీవో ఎస్ నెం 3 ప్రయోజనాలు కాపాడాలని ఆయన కోరారు. షెడ్యూల్ ఏరియాలో టీచర్ పోస్టులు గిరిజనులకే దక్కేలా చూడాలని ఆయన కోరారు. 

 

రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ది లోపం గిరిజనులకు శాపంగా మారిందని ఆరోపణలు చేసారు చంద్రబాబు. వైసీపీ ఉదాసీనత వల్లే బీసీల సాధికారతకు విఘాతమని మండిపడ్డారు. వైసీపీ చిత్తశుద్ధి లోపం వల్లే స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు 34% నుంచి 24%కు కోత పెట్టారని ఆయన లేఖలో ప్రస్తావించారు. జీవో ఎంఎస్ నెం3 ప్రయోజనం కాపాడి గిరిజన సాధికారతకు దోహదపడాలని సిఎం జగన్ కి చంద్రబాబు విజ్ఞప్తి చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: