గుంటూరు మాజీ పార్ల‌మెంట్ స‌భ్యుడు రాయపాటి సాంబశివరావు నిన్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న రాత్రి ఛాతి నొప్పి రావ‌డంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్ లోని ప్రవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం రాయపాటి క్షేమంగానే ఉన్నారని ఆయ్న కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రాయపాటి అస్వస్థతకు గురయ్యారని తెలిసిన వెంటనే టీడీపీ నేతలు ఫోన్ ద్వారా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 
 
లాక్ డౌన్ ప్ర‌క‌టించ‌డానికి ముందు నుంచి రాయపాటి హైదరాబాద్ లోనే ఉన్నారని తెలుస్తోంది. బ్యాంకుల‌కు రుణాల ఎగ‌వేత కేసులో సీబీఐ రాయపాటిని విచారిస్తోంది. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు చేజిక్కించుకున్న‌ రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ సంస్థ‌... బ్యాంకుల నుంచి తిరిగి తీసుకున్న రుణాలను చెల్లించలేదు. ‌ తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: