ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. అధికార వైసీపీ టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఓటు వేయడానికి అసెంబ్లీ కి వెళ్ళారు. తొలి ఓటు ని సిఎం వైఎస్ జగన్ వేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 136 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక తెలుగుదేశం నుంచి మొదటి ఓటు ని బాలకృష్ణ వేసారు. 

 

పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఓటు వేయడానికి గానూ అసెంబ్లీ కి వెళ్ళారు. ఇక టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్ళిన  ఎమ్మెల్యేలు కరణం బలరాం, వల్లభనేని వంశీ మోహన్, మద్దాలి గిరి ముగ్గురు కూడా టీడీపీకే ఓటు వేసారు. పార్టీ విప్  జారీ చేయడం తో తప్పనిసరిగా ఓటు వెయ్యాల్సి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: