తెలంగాణాలో పదో తరగతి పరీక్షలను కరోనా వైరస్ కారణంగా రద్దు చేసిన సంగతి తెలిసిందే. పదో తరగతి పరిక్షల తో పాటుగా మరి కొన్ని పరీక్షలను కూడా రద్దు చెయ్యాలి అనే డిమాండ్ వినపడుతుంది. తాజాగా ఇంటర్ సప్లమేంటరీ పరీక్షలను కూడా రద్దు చెయ్యాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేయాలని ఇంటర్ విద్యా  జెఎసి చైర్మన్ మధుసూదన్ రెడ్డి సిఎం కేసీఆర్ కి లేఖ రాసారు. 

 

గత నాలుగు సంవత్సరాలు గా ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ లో పాస్ అవుతున్న విద్యార్థుల సగటు తీసుకొని.. ఈ సారి ఇంటర్ లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మార్క్ లు కలిపి మేరకు పాస్ చేయాలని ఆయన లేఖలో కోరారు. కరోనా పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితిలో పరీక్షలు సాధ్యం కాదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: