దేశ వ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపధ్యంలో ఇప్పుడు పరీక్షలను కూడా వేగవంతం చేస్తున్నారు. రోజు రోజుకి పరిక్షల సంఖ్యను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా పెంచుతున్నాయి.  ఇక దేశ రాజధాని ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో కరోనా పరీక్షలను పెంచుతున్నారు. ఇప్పటి వరకు మన దేశంలో ఎన్ని కరోనా పరిక్షలు నిర్వహించారు అనేది ఒకసారి చూస్తే, 

 

ఇప్పటివరకు 64,26,627 నమూనాలను పరీక్షించినట్లు పేర్కొంది ఐసిఎంఆర్. 1,76,959 నమూనాలను 24 గంటల్లో పరీక్షించామని తెలిపింది. ఇక దేశ రాజధాని ఢిల్లీ లో గత 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో 20 వేల కరోనా పరీక్షలను నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. వీటి సంఖ్యను ఇంకా పెంచే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: