మనిషి పట్టుపట్టి ఏదైనా సాధిస్తారని అంటుంటారు.. నిజమే ఓ కవి అన్నట్టు కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహా పురుషులవుతారు.. అన్నట్టే కృష్టీ పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపించాడు. ఇప్ప‌టివ‌ర‌కు క‌ప్స్‌, బాటిల్స్‌తో పిర‌మిడ్ లేదా ట‌వ‌ర్స్‌లా నిర్మించడాన్ని‌ చూశాం. కానీ ఇత‌ను మాత్రం కాస్త భిన్నంగా ప్ర‌య‌త్నించాడు. మ‌లేషియాలోని కౌలాలంపూర్‌కు చెందిన మ‌హ్మ‌ద్ ముక్బెల్ మూడు గుడ్ల‌ను వ‌రుస‌గా పేర్చాడు. అంటే.. ఒక‌దానిపై ఒక‌టి చ‌క్క‌గా పేర్చాడు. ఇలా క‌నీసం ఐదు సెకండ్ల‌పాటు ప‌డ‌కుండా నిల‌బెట్టి ప్ర‌పంచ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు.

 

ఎన్నిరోజుల నుంచి ప్రాక్టీస్ చేశాడో తెలియ‌దు కానీ, ట్విట‌ర్‌లో షేర్ చేసిన వీడియోలో ఫ‌స్ట్ అటెమ్‌కే మూడు కోడిగుడ్ల‌తో ట‌వ‌ర్ క‌ట్టేశాడు. ఇలా చేయాలంటే చాలా నైపుణ్యం క‌లిగుండాలి. కాగా, 20 ఏండ్ల మ‌హ్మ‌ద్ చేసిన అధ్భుత‌మైన ప్ర‌తిభ‌ను గిన్నిస్ వ‌రల్డ్ రికార్డ్స్ ఇంకా గుర్తించ‌లేదు. జిడబ్ల్యుఆర్ నిబంధనల ప్రకారం గుడ్లు  తాజాగా ఉంటేనే ఇలా చేయ‌గ‌ల‌ర‌ని చెప్పుకొచ్చింది. ఏదైతేనేం.. బాలుడి నైపుణ్యాలు, స‌హ‌నాన్ని చాలామంది అభినందిస్తూ ఈ వీడియోను వైర‌ల్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: