ప్రముఖ ఆర్థికవేత్త విశ్రాంత ఐఏఎస్ అధికారి బిపి  విటల్ కన్నుమూశారు. ఈరోజు ఉదయం బంజారాహిల్స్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు బిపి విటల్. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన ఈయన 1950 బ్యాచ్ కు  చెందిన ఐపీఎస్ అధికారి. 


 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక ప్రణాళిక శాఖ కార్యదర్శిగా కూడా సుదీర్ఘకాలం పాటు పనిచేసిన ఐఎంఎఫ్ సలహాదారుగా... 10 వ ఆర్థిక సంఘం సభ్యుడిగా కూడా ఈయన  బాధ్యతలు నిర్వర్తించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీడియా వద్ద సలహాదారుగా కూడా పనిచేశారు ఈయన. ఏపీలో కూడా పలువురు మంత్రుల వద్ద వివిధ హోదాల్లో పని చేశారు. ఈయన మృతి పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు స్పందిస్తూ...  ఆయన సేవలను స్మరించుకుంటూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు

మరింత సమాచారం తెలుసుకోండి: