ప్రస్తుతం పలు రాష్ట్రాలలో ఈరోజు రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతి ఓటు కీలకంగా మారుతుంది ఈ ఎన్నికల్లో . ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్లో జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రతి ఓటు ఎంతో కీలకంగా మారుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు అందరూ తప్పక హాజరు హాజరు కావాల్సి వచ్చింది,
దీంతో కరోనా వైరస్ బారిన పడిన ఎమ్మెల్యే సభకు వచ్చి తన ఓటు వినియోగించుకున్నారు. ఇలా రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే. క్వారంటైన్ లో ఉన్న పూర్తి పీపీఈ కిట్ ధరించి ఫుల్ ప్రొటెక్షన్ తో సభలోకి ఎంట్రీ ఇచ్చారు ఆయన. దీంతో సభలో ఆయన సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారిపోయారు. కాగా ప్రస్తుతం మధ్య ప్రదేశ్ లో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి,
Madhya Pradesh: A congress mla who had tested positive for #COVID19, arrives at the state legislative assembly in bhopal to cast his vote. Voting is currently underway for three rajya sabha seats of the state. #RajyaSabhaElection pic.twitter.com/P8wltUu8fT
— ANI (@ANI) June 19, 2020