ఏపీలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఒక్కరోజే 465 కరోనా కేసులు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గడచిన 24 గంటల్లో 17,609 నమూనాలను పరీక్షించగా 465 మందికి వైరస్ నిర్ధారణ అయింది. వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 376 మంది ఉండగా విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 89 మంది కరోనా భారీన పడ్దారు. 
 
గత 24 గంటల్లో నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 7,961కు చేరింది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో నలుగురు వైరస్ భారీన పడి మృతి చెందారు. కృష్ణా జిల్లాలో ఇద్దరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలలో ఒకరు చొప్పున మరణించారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 96కు చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: