టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు మద్దాలి గిరి  వల్లభనేని వంశీ మోహన్ కరణం బలరాం రాజ్యసభ ఎన్నికల్లో తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఇక ఓటింగ్ ముగిసిన తర్వాత టీడీపీ  రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ మీడియా తో మాట్లాడారు. చంద్రబాబు ఇప్పటికి అయినా తన చెంచాలను పక్కన పెట్టాలి అని ఆయన సూచించారు. 

 

ప్రతిపక్ష హోదా కూడా లేని  దశకు చంద్రబాబు వచ్చారని ఆయన ఆరోపణలు చేసారు. బలం ఉన్నప్పుడు దళిత అభ్యర్ధిని నిలబెట్టలేదు అని ఇప్పుడు బలం లేనప్పుడు నిలబెట్టారు అని మండిపడ్డారు. దేశంలో ఏ సిఎం చేయని విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఏపీ సిఎం జగన్ చేస్తున్నారని అన్నారు. పోటీ కూడా ఇవ్వలేని టీడీపీ పోటీ ఎందుకు నిలబెట్టింది అని ఆయన ఆరోపించారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఇప్పుడు విప్ ఎందుకు ఇచ్చారు అని నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: