టీడీపీ నావను ధర్మాడి సత్యం కూడా లాగే అవకాశం లేదని అన్నారు టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్. టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యంగా రాజ్యసభ ఎన్నికల ఓటింగ్ ముగిసిన తర్వాత వంశీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు లక్ష్యంగా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఓడిపోతామని తెలిసినా సరే వర్లను పోటీలో ఎందుకు నిలబెట్టారు అని ఆయన ప్రశ్నించారు. 

 

అసలు చంద్రబాబుకి రేటు ఇచ్చే వాళ్ళు దొరకలేదు ఏమో అంటూ ఆయన ఎద్దేవా చేసారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పుడు అసలు విప్ ఎందుకు ఇచ్చారు అని ఆయన నిలదీశారు. చంద్రబాబు ఇప్పటికి అయినా సరే పక్కన ఉన్న గ్యాంగ్ ని పక్కన పెట్టకపోతే మాత్రం ఆయనకు ఇబ్బందే అంటూ హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: