ఢిల్లీ ఆరోగ్య శాఖా మంత్రి సత్యేంద్ర జైన్ ఆరోగ్యం విషమంగా మారింది. ఉదయం ఆయన ఆరోగ్యం క్షీణించగా కాసేపటి క్రితం మరింత విషమించింది అని వైద్యులు వెల్లడించారు. ఆయనకు సీరియస్ న్యుమోనియా ఉంది అని అధికారులు పేర్కొన్నారు. దీనితో ఆయనను ప్రభుత్వ ఆస్పత్రి నుంచి ప్రవేట్ ఆస్పత్రి ఐసియుకి తరలించారు. 

 

ఇప్పుడు అసలు గాలి తీసుకోవడం లేదు అని దీనితో ఆయనకు న్యుమోనియా చికిత్స అందిస్తున్నామని వైద్యులు చెప్పారు. ఇక ఆయనకు ప్లాస్మా చికిత్స చేయడానికి గానూ రెడీ అయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలి అని తాను  కోరుకుంటున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఆయనను సాకేత్ సూపర్ మ్యాక్స్ ఆస్పత్రికి అధికారులు తరలించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: