ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. వైసీపీ నుంచి పోటీ చేసిన నలుగురు అభ్యర్ధులు విజయం సాధించారు. టీడీపీ నుంచి పోటీ చేసిన వర్ల రామయ్య ఎన్నికల్లో  ఓటమి పాలయ్యారు. ఇది ఇలా ఉంటే టీడీపీకి అసలే తక్కువ ఓట్లు ఉన్న వేళ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని తప్పు చేసారు. 

 

అవగాహనా లోపంతో ఓటింగ్ లో పొరపాటు చేసారు. మొదటి ప్రాధాన్యత స్థానంలో 1 అని పెట్టాల్సిన చోట టిక్ మార్క్ పెట్టారు ఆమె. దీనిపై పార్టీ అధినేత చంద్రబాబు సీరియస్ అయ్యారు. అవగాహన కల్పించడం లో విఫలమయ్యారని పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసారు. మరోవైపు ఉద్దేశపూర్వకంగా చెల్లని ఓట్ వేసారు టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు మద్దాలి గిరి, కరణం బలరాం, వల్లభనేని వంశీ.

మరింత సమాచారం తెలుసుకోండి: