దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కు కరోనా సోకింది. కరోనా లక్షణాలు కనిపించటంతో ఆయన పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయన భార్యాపిల్లలకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించగా ఫలితాలు తెలియాల్సి ఉంది. నిర్మాతకు కరోనా సోకడంతో టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 
 
బండ్ల గణేష్ ఉన్న ఏరియాలోనే ఇతర సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. ఆయన షాద్ నగర్ నుంచి హైదరాబాద్ తరచూ జర్నీ చేస్తున్నారు. దీంతో ఆయనకు సన్నిహితంగా మెలిగిన వాళ్లలో కూడా కరోనా భయం నెలకొంది. అధికారులు బండ్ల గణేష్ ను కలిసిన వారి వివరాలను సేకరించి క్వారంటైన్ కు తరలిస్తున్నారని సమాచారం. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: