షాద్నగర్కు చెందిన రియల్టర్, కాంగ్రెస్ నేత రామచంద్రారెడ్డి నిన్న రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. తొలుత నిన్న సాయంత్రం ఆయన కిడ్నాపైనట్టు వార్తలు వచ్చాయి. రామచంద్రారెడ్డి డ్రైవర్ ఢిల్లీ వరల్డ్ స్కూల్ ముందు ఇద్దరు దుండగులు బైక్పై వచ్చి కిడ్నాప్ చేసినట్టు నిన్న సాయంత్రం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసుకుని ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టగా కొత్తూరు మండలంలోని పెంజర్ల గ్రామ సమీపంలో రామచంద్రారెడ్డి హత్యకు గురైనట్టు పోలీసులకు సమాచారం అందింది.
షాద్నగర్ పరిధిలోని ఫరూక్ నగర్ మండలం అన్నారం గ్రామంలోని భూ వివాదం నేపథ్యంలో హత్య జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రక్త సంబంధీకులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు. వివాదానికి సంబంధించిన స్థలం విలువ 6 కోట్ల రూపాయల వరకు ఉంటుందని తెలుస్తోంది.