ఇటీవల చైనా దాడుల్లో మరణించిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి 5 కోట్లు ఆయన భార్యకు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం తో పాటుగా ఇళ్ళ స్థలం  ఇవ్వడం అదే విధంగా చైనా దాడిలో మరణించిన 19 మందికి కూడా పది లక్షలు ఇవ్వాలి అని తెలంగాణా సర్కార్ నిర్ణయం  తీసుకోవడంపై ఇప్పుడు సోషల్ మీడియాలో పలువురు ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. 

 

దీనిపై దేశ వ్యాప్తంగా కూడా పలువురు కేసీఆర్ సర్కార్ ని కొనియాడుతున్నారు. ఇది నిజంగా మంచి పరిణామం అని సైనికుల కోసం ప్రతీ ఒక్కరు కూడా స్వచ్చందంగా ముందుకు రావాలి అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏ రాష్ట్రం కూడా ఈ విధంగా సహాయం చేసిన పరిస్థితి లేదు అనే సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: