సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ ఏదోక విషయాన్ని తన అభిమానులతో పంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ. తాజాగా ఆయన మరోసారి ట్వీట్ చేసారు. “న్యాయ స్థానంలో ఒక తీర్పు రెండు  పక్షాలలో ఒక పక్షానికి నచ్చదు .రాజకీయ అధికారంలో జరిగే మార్పు ఇరుపక్షాలలో ఒకరికి నచ్చదు. 

 

కుటుంబంలో జరిగే మార్పు మంచిదైతే భార్యాభర్తలిద్దరికీ నచ్చుతుంది, చెడ్డదైతే ఇద్దరికీ నచ్చదు.తెలిసి మసలుకోండి సన్నిహితులారా” అంటూ జీవిత సత్యం చెప్పారు ఆయన. కాగా ఇప్పుడు బాలకృష్ణ  కోసం గానూ ఒక కథ రాస్తున్నారు. అలాగే చిరంజీవి తో కూడా మరోసారి పని చేయడానికి గానూ రెడీ అయ్యారు ఆయన. త్వరలోనే వీరి కాంబో సినిమా మొదలు కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: