దేశ వ్యాప్తంగా వలస కార్మికులు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వలస కార్మికులు చాలా మంది ఇప్పుడు ఉపాధి లేక రోడ్డున పడిన సంగతి తెలిసిందే. మన దేశంలో దాదాపు 7 రాష్ట్రాల నుంచి వలస కార్మికులు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు అందరూ కూడా అవస్థలు పడుతున్నారు. ఇక ఇప్పుడు కేంద్ర సర్కార్ వారిని ఆదుకోవడానికి గానూ సిద్దమైంది.
ఈ నేపధ్యంలోనే ఆరు రాష్ట్రాల్లో ఉన్న వలస కార్మికుల కోసం గరీబ్ కళ్యాణ్ రోజ్ గారి యోజన అనే పథకం ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా 25 ప్రాజెక్టుల్లో వలస కార్మికులను ఉపాధి కల్పిస్తుంది కేంద్రం. దీనికి ప్రత్యేక బడ్జెట్ ని కూడా కేటాయించారు.
PM @narendramodi to launch #GaribKalyanRojgarAbhiyaan today to boost livelihood opportunities in rural india through video-conference pic.twitter.com/ZVhoji6eSY
— MIB india 🇮🇳 #StayHome #StaySafe (@MIB_India) June 20, 2020