గత కొన్ని రోజులుగా తెలంగాణలో కరోనా కేసులు బాగా పెరిగిపోతున్నాయి. సామన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ కరోనా ఎవ్వరినీ వదలడం లేదు. ఇటీవల కాలంలో వరుసగా ప్రజా ప్రతినిధులకు కరోనా పాజిటీవ్ రావడం కలవరం సృష్టిస్తుంది.  తాజాగా  నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ కారు డ్రైవర్‌తో పాటు ఆయన గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. గత ఆదివారం(జూన్ 14) బాజిరెడ్డికి కరోనా సోకగా.. గురువారం ఆయన సతీమణికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ ఫోటో జర్నలిస్టుతో పాటు హైదరాబాద్‌లో ఉంటున్న ఆయన సతీమణి, కుమార్తెకు కూడా పాజిటివ్‌గా తేలింది. అప్రమత్తమైన అధికారులు వారిని క్వారంటైన్‌కు పంపినట్టు తెలుస్తోంది. 

 

తెలంగాణలో మొదట జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నిజామాబాద్‌ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు కూడా పాజిటివ్‌గా తేలింది. ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్‌, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిలను గతంలో కలవడంతో అనుమానం వచ్చి పరీక్షలు చేయించుకోగా గణేష్ గుప్తాకు పాజిటివ్‌ వచ్చింది.

 

ప్రస్తుతం హైదరాబాద్‌లోని తన స్వగృహంలోనే ఆయన చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డితో కాంటాక్ట్ కావడం వల్లే ఆయనకు కోవిడ్ సోకిందని భావించారు. ఇలా ప్రజాప్రతినిధులు కూడా వైరస్ బారినపడటం కలకలంరేపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: