భారత్ చైనా సరిహద్దుల్లో జరిగిన దాడిపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని వ్యాఖ్యలు చేసారు. అసలు చైనా దురాక్రమణ కు పాల్పడలేదు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. దీనిపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆయన ఈ మేరకు ట్వీట్ చేసారు.
అసలు చైనాకు మన భూభాగం ఇచ్చేసారు అని ఆయన ఆరోపణలు చేసారు. చైనా దురాక్రమణకు భారత భూభాగాన్ని ప్రధాని అప్పగించారని ఆయన మండిపడ్డారు. 1. మన సైనికులు ఎందుకు చంపబడ్డారు? 2. వారు ఎక్కడ చంపబడ్డారు? అని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. కాగా నిన్న అఖిలపక్ష సమావేశంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేసారు.
PM has surrendered indian territory to Chinese aggression.
— rahul gandhi (@RahulGandhi) June 20, 2020
If the land was Chinese:
1. Why were our soldiers killed?
2. Where were they killed? pic.twitter.com/vZFVqtu3fD