ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయ నాయకులను కరోనా తీవ్రంగా వేధిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా దెబ్బకు రెండు రాష్ట్రాల నాయకులు ఇళ్ళ నుంచి బయటకు రావాలి అంటే భయపడుతున్నారు. తెలంగాణాలో పలువురు బిజెపి నేతలకు కొందరు తెరాస ఎమ్మెల్యేలకు అలాగే స్థానిక నాయకులకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. 

 

ఇక తాజాగా అనంతపురం జిల్లాలో కరోనా లక్షణాలతో ఒక వైసీపీ నేత ప్రాణాలు కోల్పోయారు. ధర్మవరం వైసీపీ నేత ఒకరు నగరంలోని కోవిడ్ ఆస్పత్రిలో వారం రోజులుగా చికిత్స పొందుతున్నారు.  ఇక అతని ఆరోగ్యం క్రమంగా విషమించడం తో ఈ రోజు ఉదయం గుండెపోటు తో ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల ఎమ్మెల్యే గన్ మెన్ కి కూడా కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: