కరోనా ఉన్న వారి దగ్గరకు వెళ్ళాలి అంటే గుండె జారిపోతుంది. కనీసం వాళ్ళను కన్నెత్తి చూసే పరిస్థితి కూడా ఉండదు అనే సంగతి తెలిసిందే. తాజాగా ఒక ఘటన గురించి చదివితే మాత్రం అమ్మో అనే విధంగా ఉంటుంది. కరోనా పేషెంట్ నుంచి ఒక వ్యక్తి ఏకంగా ఫోన్ దొంగతనం చేసాడు. అవును ఈ ఘటన గౌహతి లో జరిగింది. 

 

అసోంలోని చిరాంగ్ జిల్లా జెఎస్‌ఎస్‌బి సివిల్ హాస్పిటల్‌లో 22 ఏళ్ల బ‌ర్మ‌న్‌ చేతిలో స‌రిగ్గా డ‌బ్బు చాల‌క‌పోవ‌డంతో ఐసోలేషన్ వార్డ్ కి స్కెచ్ వేసి... స్మార్ట్ ఫోన్ దొంగతనం చేసాడు. ఈ వ్యవహారం సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు కావడంతో అతనిని అదుపులోకి తీసుకుని క్వారంటైన్ కి సేన్తరికి తరలించి కరోనా పరిక్షలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: