గత కొన్ని రోజులుగా నగరంలో కరోనా బీభత్సం సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో నేరల సంఖ్య భారీగా తగ్గింని పోలీసులు అంటున్నారు.  కానీ, కొన్ని చోట్ల మాత్రం నేరగాళ్ళు రెచ్చిపోతూనే ఉన్నారు.  తాాజగా   సికింద్రాబాద్ పరిధిలోని ఓ యువతి అదృశ్యమైన ఘటన చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. చిలకలగూడ కు చెందిన మమత అనే యువతి ఓ షాపులో సేల్స్ గర్ల్ గా పనిచేస్తుంది  ఈ నెల 16 వ తేదీన ఇంటి నుండి షాప్ కు బయల్దేరిన ఆమె తిరిగి ఇంటికి చేరుకోలేదు.ఆమె మొబైల్  స్విచాఫ్ వస్తుండడంతో సమీప బంధువులు,స్నేహితులను ఆరాతీయగా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. 

 

దుకాణం కి వెళ్ళిన ఆ యువతి ఎటు వెళ్లింది అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.యువతి ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి గల కారణాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మీద అదృశ్యం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: