కృష్ణా జిల్లాలో కరోనా కేసులు వేగంగా నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా సరే కేసులు మాత్రం ఆగడం లేదు జిల్లాలో. ప్రతీ రోజు కూడా ఎక్కడో ఒక చోట కరోనా కేసులు భారీగా నమోదు అవుతూనే ఉన్నాయి. ఈనెల 10వ తేదీన జిల్లాలో కరోనా కేసులు 635 ఉన్నాయి ప్రభుత్వ లెక్కల ప్రకారం. 

 

ఇక నిన్నటికి అంటే... 19వ తేదీ నాటికి ఆ సంఖ్య 1,173 చేరుకుంది అని అధికారులు వెల్లడించారు. శుక్రవారం ఒక్కరోజే 82 కేసులు  జిల్లాలో నమోదు అయ్యాయి. ఇక కరోనా ఇప్పుడు కృష్ణా జిల్లాలో గ్రామాల్లో కూడా అడుగు పెట్టింది అని అధికారులు గుర్తించారు. కంకిపాడు పెనమలూరు మండలాల్లో కేసులు నమోదు అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: