ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న తీన్మార్ మల్లన్న పై కేసు నమోదు చేసారు పోలీసులు. సీఎం కేసీఆర్‌తో పాటుగా ఆయన కుటుంబ సభ్యులను పోలీస్ ఉన్నతాధికారులను అనుచిత వ్యాఖ్యలు చేసారు ఆయన. దీనితో జూబ్లీహిల్స్ పోలీసులు స్టేషన్‌లో కేసు నమోదు చేసారు. సయ్యద్ మెయిన్ అనే విద్యార్థి ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేసారు. 504, 505(1)(సీ), 505 (2), 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. 

 

ఒక ఛానల్ లో పని చేస్తున్న ఆయన సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో కేసీఆర్ సర్కార్ విధానాలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులతో అవినీతికి పాల్పడ్డారు అని వ్యాఖ్యలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: