బిసిసిఐ అధ్యక్షుడు టీమిండియా మాజీ సారథి అయిన సౌరవ్ గంగూలీకి కరోనా  కష్టాలు తప్పడం లేదు అన్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న సౌరవ్ గంగూలీ కుటుంబంలో ఇద్దరికీ కరోనా  పాజిటివ్ రాగా... తాజాగా గంగూలి  అన్నయ్య, వారి కుటుంబ సభ్యులైన బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి స్నేహశీష్  భార్యకు కరోనా  పాజిటివ్ అని నిర్ధారణ అయింది. 

 

 అయితే దాదా కుటుంబం లో కరోనా కేసులు పెరుగుతుండటం అభిమానులను  ఆందోళనకు గురి చేస్తోంది. దాదా కుటుంబానికి చెందిన నలుగురు అస్వస్థతకు గురికావడంతో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం వీరు ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో చికిత్స పొందుతున్నారు. అయితే వీరు దాదా కుటుంబీకులే కానీ ఒకే ఇంట్లో ఉంటున్న వారు కాదు. అయితే కరోనా సంక్షోభంలో కూడా దాదా ఐపీఎల్ నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తుంటే ఆయన కుటుంబ సభ్యులే ప్రస్తుతం కరోనా బారినపడటం  కాస్త కలవరానికి గురిచేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: