జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ డాక్యుమెంట్ కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే దీనిపై విచారణను ముమ్మరం చేసిన  పోలీసులు తాజాగా పురోగతి సాధించారు. జెసి వర్గీయులను  ముగ్గురిని  శనివారం అరెస్ట్ చేశారు పోలీసులు. నకిలీ పత్రాలు సమర్పించి బిఎస్ 3 వాహనాలను బి ఎస్4 గా మార్చి రిజిస్ట్రేషన్ చేయించిన నాగేశ్వర్రెడ్డి,  సోమశేఖర్,  రమేష్ లను  తాడిపత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

 


 ఈ ముగ్గురు వ్యక్తులు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సహకారంతో పలువురు ప్రైవేట్ ఆపరేటర్లకు లారీలను విక్రయించినట్లు పోలీసులు విచారణలో తేలింది. నకిలీ క్లియరెన్స్ సర్టిఫికెట్ లు తయారు చేయడంతో పాటు పోలీసులు సంతకాలు చేసినట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: