పోతుంది.. నిజంగా సమాజం సర్వనాశనం అవుతుంది.. మనుషులు ఇప్పుడు రాక్షసుల్లా.. ఉన్మాదులుగా మారితున్నారు.. జీవ హింసకు తెరలేపుతున్నారు.. ఇది కలికాల ప్రభావం అని అంటున్నారు కొన్ని దారుణమైన సంఘటనలు సోషల్ మీడియలో చూస్తున్న నెటిజన్లు.  ఇటీవల వరుసగా మూగ జీవాలను ఎంత దారుణంగా హింసించి చంపారో చూస్తూనే ఉన్నాం. తాజాగా తానున్న పరిస్థితి ఏంటో తెలియని అమాయం.. మతిస్థిమితం లేని ఓ మహిళను ఇద్దరు రాక్షసులు అతి దారుణంగా జుట్టుపట్టి లాగి..  రాళ్లతో కొట్టి హింసించారు.

 

ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. మానవత్వం మరిచి ఆమెపై వారు చేసిన ఆ దాడికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. జుట్టు పట్టి లాగుతూ వారు ప్రవర్తించిన తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు  చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ దాడి ఎందుకు చేశారన్న విషయంపై ఆరా తీస్తున్నారు.

 

మహిళ ఆకలితో బాధపడుతూ ఫరూఖాబాద్‌లోని తిర్వా కాలనీకి వెళ్లిందని, ఆమెను యువకులు చితక్కొట్టారని స్థానికులు తెలిపారు. ఆమె ఎంతగా కేకలు వేసినా.. వద్దూ అంటూ బ్రతిమిలాడినా..  కనికరం లేకుండా గొడ్డును బాదినట్లు బాదారు. చివరకు ఆ మహిళ వద్దకు స్థానికులు రావడంతో ఆ యువకులు పారిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: