ఏపీ కరోనా కేసుల తాజా బులెటిన్‌ను వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా విడుదల చేసింది. గత 24 గంటల్లో మొత్తం 491 కేసులు నమోదయ్యాయి. వీరిలో స్థానికులు 390 మందికాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 83మంది, విదేశాల నుంచి వచ్చినవారు 18 మంది ఉన్నారు.  కోవిడ్ కారణంగా కృష్ణాలో ఇద్దరు, కర్నూల్‌లో ఇద్దరు, గుంటూరులో ఒకరు మృతి చెందారు. స్థానికంగా ఉన్నవారిలో 138 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.  విదేశాల నుంచి వచ్చిన వారిలో తాజాగా 18 మంది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

 

ఇప్పటి వరకు మొత్తం 326 కేసులు నమోదు కాగా, 277 మంది చికిత్స పొందుతు న్నారు.. 49 మంది డిశ్చార్జ్ అయ్యారు.  ఈరోజు కరోనా చికిత్స పొందుతూ ఐదుగురు  మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 101కి చేరింది. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయినవారి సంఖ్య 4,111కి చేరింది. గత 24 గంటల్లో 138 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 4,240 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: